హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ పనుల నిలిపివేతకు మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేంద్రం ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని.. వాటిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా తొగుటవాసి దాఖలు చేసి న వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం విచారించింది. పనుల నిలిపివేత ఉత్తర్వు లు జారీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వినతిని న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ కే లక్ష్మణ్ల తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొత్తది కాదని.. ప్రజాఅవసరాల కోసం నీ టిపారుదల ప్రాజెక్టుల ని ర్మాణం జరుగుతున్నదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్ర సాద్ తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు కు గడువు కావాలని కోరా రు. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ను పరిశీలించాకే ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొన్న ధర్మాసనం విచారణను నాలుగు వా రాలు వాయిదా వేసింది.