శంషాబాద్ రూరల్, జూలై 3: శంషాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం రూ.14.2 కోట్ల విలువైన హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి ని తనికీ చేయగా, ఆమె వద్ద హెరాయిన్ ప్యా కెట్లు లభించాయి. 2027 గ్రాములు ఉన్న హెరాయిన్ విలువ మార్కెట్లో రూ.14.2 కోట్లు ఉం టుందని అధికారులు వెల్లడించారు. నిందితురాలిని అరెస్టు చేశారు.