TPCC | గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ(పీఏసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను ఇంచార్జిలుగా నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పీఏసీలో సోమవారం నిర్ణయం తీసుకున్నారు. రేవంత్రెడ్డి, భట్టి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు రెండేసి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా మిగిలిన వారికి ఒక్కో నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఇందులో సీఎం రేవంత్రెడ్డి చేవెళ్ల, మహబూబ్నగర్ రెండు నియోజకవర్గాలకు ఇంచార్జీగా వ్యవహరిస్తుండగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇంచార్జిగా వ్యవహరించనున్నారు. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు ఇంచార్జీగా వ్యహరించనున్నారు.
అయితే ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపు, ఎంపీ టికెట్ల కేటాయింపు పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని, ఇందులో తన పాత్ర నామమాత్రమే అని రేవంత్ చెప్పినట్లు తెలిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్లీ టికెట్ దక్కే అవకాశం లేదని, ఈ విషయంలో అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని ఆయన అన్నట్లు తెలిసింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బరిలో దింపాలని యోచిస్తున్నట్లు షబ్బీర్ అలీ తెలిపారు. ఇందులో భాగంగానే పీఏసీలో ఏకగ్రీవ తీర్మాణం చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి సోనియాగాంధీతో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయనున్నట్లు తెలిపారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలు
చేవెళ్ల, మహబూబ్నగర్- రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్, హైదరాబాద్- భట్టి విక్రమార
నాగర్కర్నూల్- జూపల్లి కృష్ణారావు
నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్- కొండా సురేఖ
మహబూబాబాద్, ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్- సీతక
పెద్దపల్లి- శ్రీధర్ బాబు
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
నిజామాబాద్- జీవన్ రెడ్డి
జహీరాబాద్- పి. సుదర్శన్ రెడ్డి
మెదక్- దామోదర రాజనర్సింహ
మలాజిగిరి- తుమ్మల నాగేశ్వరరావు