Gruhajyothi | రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడిన వినియోగదారులకు మార్చి నుంచి ‘0’ బిల్లు అమలు చేయాలని డిస్కంలను ఇంధన శాఖ ఆదేశించింది. గృహజ్యోతి పథకం అమలుకు సంబంధించి మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
☞ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఒక కనెక్షన్కు ఈ పథకం వర్తిస్తుంది.
☞ ప్రజాపాలన లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఆధార్తో అనుసంధానమైన తెల్ల రేషన్ కార్డు, గృహ విద్యుత్ కనెక్షన్ నంబర్ ఉన్నవాటికి ఈ పథకం వర్తిస్తుంది.
☞ అర్హులైన ఇంటికి 200 యూనిట్ల వరకు ‘0’ బిల్లు అందజేయాలి.
☞ జీరో బిల్లు కోసం డిస్కంలు ప్రత్యేకంగా వినియోగదారుల పేర్లను మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పేర్లతోనే బిల్లులు మంజూరు చేయాలి.
☞ డిస్కంలు జీరో బిల్లులను ప్రభుత్వానికి పంపిస్తే, ప్రతి నెల 20వ తేదీనాటికి ప్రభుత్వం ఆ రాయితీ మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తుంది.
☞ గృహజ్యోతి కనెక్షన్ను వ్యాపార అవసరాలకు వినియోగించినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
☞ ఒకవేళ ఎవరైనా అన్ని అర్హతలు ఉండి, ఈ పథకం కింద జీరో బిల్లు రాకపోతే సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలి. రేషన్కార్డు, విద్యుత్ కనెక్షన్కు సంబంధించిన యూఎస్సీ వివరాలతో ప్రజాపాలన పోర్టల్ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకోవాలి. అధికారుల నుంచి రసీదు తీసుకోవాలి. పరిశీలన అనంతరం అర్హులని తేలితే.. ఆ మరుసటి నెల నుంచి జీరో బిల్లు మంజూరు చేస్తారు. అప్పటికే కట్టిన బిల్లులు తిరిగి ఇవ్వడం కుదరదు.