మరణించిన అసంఘటితరంగ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ
ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచందర్రావు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. మరణించిన కార్మికుడి కుటుంబసభ్యురాలు డీ జగదీశ్వరికి రూ.6.30 లక్షలు, తల్లిని కోల్పోయిన శ్రీనివాస్కు రూ.1.30 లక్షలు, భార్య ప్రసవం నిమిత్తం తులసీరాంకు రూ.30 వేలు చెక్కులు అందజేశారు. -హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)