Medaram Jatara | తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర మరో రెండు రోజుల్లో మొదలవనున్నది. ఈ నెల 21 నుంచి 24 వరకు మహా జాతర జరగనుంది. ఈ మేరకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జాతరకు ప్రత్యేక బస్సులతో పాటు ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేటు వాహనాల్లోనూ చాలా మంది భక్తులు మేడారం వెళ్తున్నారు. అయితే, అన్ని దారులు మేడారం వైపే వెళ్తుండడంతో అకడ విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఉంది. బస్సులు, ట్రైన్లు కూడా ఇప్పటి నుంచే కికిరిసిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో మేడారం వెళ్లాలనుకునే భక్తులు ఎలాంటి ప్రయాసలు లేకుండా ఈజీగా అమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నది. హైదరాబాద్, హనుమకొండ నుంచి హెలికాప్టర్లో వెళ్లి మేడారం సమ్మక సారలమ్మలను దర్శించుకునే వీలు కల్పిస్తున్నది. ఈ మేరకు హెలిటాక్సీ సంస్థ.. తెలంగాణ ప్రభుత్వం, బెంగళూరుకు చెందిన తుంబీ ఏవియేషన్ హెలీకాప్టర్ అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 25 వరకు హెలికాప్టర్ సేవలు అందించనున్నది. అక్కడ ఏడు నిమిషాల పాటు ఆకాశం నుంచి జాతరను వీక్షేందుకు జాయ్ కూడా హెలిటాక్సీ ఏర్పాటు చేసింది.
హనుమకొండ- మేడారం-హన్మకొండ షటిల్ ఒక్కొక్కరికి రూ.28,999 టికెట్ నిర్ణయించారు. ఈ ప్రయాణంలో భక్తులు హనుమకొండ నుంచి బయలుదేరి మేడారంలో హెలీకాప్టర్ దిగొచ్చు. అక్కడ వీఐపీ దర్శనం అనంతరం తిరిగి హనుమకొండలో దింపుతారు. 20-30 నిమిషాల్లో హనుమకొండ నుంచి మేడారానికి తీసుకెళ్లే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే మేడారంలో ఏరియల్ (జాయ్ కింద 7నిమిషాలపాటు గాలిలో తిప్పేందుకు ఒక్కొక్కరు రూ.4,300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజధాని హైదరాబాద్ మేడారానికి కూడా ప్యాకేజీని ప్రకటించారు. ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన చాపర్లో ఒక్కరికి రూ.95,833గా టికెట్ ధరను నిర్ణయించారు. బేగంపేట ఎయిర్ నుంచి హెలీకాప్టర్ను నడిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 7483432752, 9400399999 నంబర్లలో సంప్రదించవచ్చునని సంస్థ తెలిపింది.