హైదరాబాద్: సంక్రాతికి (Sankranti) పట్నవాసులు పల్లె బాటపట్టారు. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై (ఎన్హెచ్ 65) వాహనాలు బారులుతీరాయి. తెల్లవారుజామున పొగమంచు వల్ల వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్ ప్లాజాలో మొత్తం 18 టోల్ బూత్లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు.
భారీగా వాహనాలు వస్తుండటంతో చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్తోపాటు పలు కూడళ్ల దగ్గర ట్రాఫిక్ నిలిచిపోతున్నది. అదేవిధంగా హైదరాబాద్లోని ఆటో నగర్ నుంచి దండుమల్కాపురం వరకు ఆరు వరుసల రహదారి విస్తరణ పనులు కొనసాగుతుండటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది.