మహబూబ్నగర్ : జిల్లా పరిధిలోని జడ్చర్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జడ్చర్లలోని గాంధీ చౌరస్తా వద్ద రైల్వే పనులతో ప్రత్యామ్నాయ దారిని మూసివేశారు. దీంతో జడ్చర్ల నుంచి కల్వకుర్తి, వనపర్తి, నాగర్కర్నూల్ వైపు వెళ్లే మార్గాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జడ్చర్ల నుంచి ఈ మూడు పట్టణాలకు వెళ్లేందుకు ఒకే మార్గం ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.