సంక్రాంతి పండుగకు నగర వాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా నుంచి విజయవాడ వరకు 65వ జాతీయ రహదారి పొడవునా వాహనాలు వరుస కట్టాయి.
దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంతంగి టోల్గేట్ నుంచి 65 వేల వాహనాలు వెళ్లినట్టు జీఎంఆర్ అధికారులు తెలిపారు.
– చౌటుప్పల్