హైదరాబాద్: నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Hyderabad) తెలిపింది. ఉత్తర తెలంగాణలోని (North Telangana) 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీచేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుతోపాటు వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కాగా, శుక్రవారం రాత్రి హైదరాబాద్తోపాటు పరిసర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, చాంద్రయణగుట్ట, కూకట్పల్లి, హైదర్నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట్, బాచుపల్లి, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట, మారేడ్పల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో వానకురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది.