గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
కేటీదొడ్డి, ఏప్రిల్ 8 : పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయ కమిటీ చైర్మ న్, సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని వెంకటాపురం గ్రామంలోని వెంకన్న ఆలయానికి నూతన కమిటీని ఏర్పాటు చేయగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. చైర్మన్ వెంకట్రామిరెడ్డి, డైరెక్టర్లు వేమారెడ్డి, రాజేశ్, రఘునందన్రెడ్డి, సుజాత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కర్ణాటక,మహారాష్ట్రతోపాటు మ న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని, వారికి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఆలయం మరింత ప్రసిద్ధి చెందాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి చైర్మన్గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తూ ఆలయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షు డు చెన్నయ్య, ఎంపీపీలు మనోరమ, విజయ్, జెడ్పీటీసీలు రాజశేఖర్, ప్రభాకర్రెడ్డి, పద్మ, సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు కృష్ణకుమార్రెడ్డి, చక్రధర్రావు, గోపి, శ్రీనివాస్గౌడ్, ఉరుకుందు, యుగేంధర్గౌడ్, వెంకన్గౌడ్ పాల్గొన్నారు.