హైదరాబాద్ : గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్ జంటనగరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో మరికొద్ది గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. నగరంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.