TS Weather | హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాబోయే 24 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా రామాయంపేటలో 4 సెం.మీ, జనగామ జిల్లా జాఫర్గఢ్లో 4 సెం.మీ, వరంగల్ జిల్లా సంగెంలో 4 సెం.మీ, సంగారెడ్డి జిల్లా రాయకల్, ఖమ్మం జిల్లా మధిర, ములుగు జిల్లా వెంకటాపురంలో 3 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.