హైదరాబాద్ : రాబోయే ఐదుగంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎనిమిది జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణశాఖ.. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.