హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలు, చెరువులు పొంగి పొర్లాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగంతోపాటు పోలీసు శాఖ అప్రమత్తమై.. ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టింది. శుక్రవారం రాత్రి రెండున్నర గంటల వ్యవధిలోనే 13.5 సెంటీమీటర్ల వర్షం కురవగా.. శనివారం ఒక్క గంట వ్యవధిలోనే 9.5 సెం. మీ. వర్షం కురిసింది. శుక్రవారం అర్ధరాత్రి వర్షానికి ఇబ్బందులు పడిన లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు.. శనివా రం కురిసిన భారీ వర్షాలతో మళ్లీ కష్టాలు ఎదుర్కొన్నాయి.
రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. ఇది మరింత బలపడి పశ్చిమ వాయ వ్య దిశగా ప్రయాణించి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్ర తీరానికి చేరుకోవచ్చని తెలిపారు. బం గాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడి ద్రోణి రూపంలో హైదరాబాద్ వైపు కదులుతున్నట్టు చెప్పా రు. దీనికి తూర్పునుంచి వీస్తున్న గాలులతో ఏర్పడిన షి యర్జోన్ తోడయి హైదరాబాద్, దాని పరిసర ప్రాంతా ల్లో భారీవర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం, ఉపరితల ఆవర్తనం, షియర్జోన్ ప్రభావంతో రాగల 36 గంటల్లో గ్రేటర్కు భారీనుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్టు హెచ్చరించారు.
ప్రధానంగా రుతుపవనాల తిరోగమన సమయంలో భారీ వర్షాలు నమోదుకావడం సాధారణం. తక్కువ సమయంలో కుంభవృష్టితో నాలాలు, చెరువులు పొంగి… రహదారులు, కాలనీల్లోకి వరద నీరు వస్తున్నది. నగరంలో ముంపు నివారణకు చేపట్టిన చర్యలతో కేవలం గంట, గంటన్నరలోనే కాలనీల నుంచి వరద నీరు సాఫీగా బయటకు వెళ్లిపోతుంది. కాగా, గత ఏడాది అక్టోబర్లోనే వంద సంవత్సరాల్లో అతి రెండో పెద్ద వర్షపాతంగా నగరంలో 30 సెంటీమీటర్ల వాన కురిసిన విషయం తెలిసిందే.
మూసీకి వరద పోటెత్తుతున్నది. ఉస్మాన్సాగర్ (గండిపేట) వద్ద నాలుగు గేట్లను ఎత్తి 1600 క్యూసెక్కులు, హిమాయత్నగర్ వద్ద ఆరుగేట్లను ఎత్తి 5,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
రాష్ట్రంలో పిడుగుపాట్లకు శనివారం ఐదుగురు ప్రాణాలు వదిలారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, హనుమకొండ జిల్లాలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పలుచోట్ల పిడుగుపాట్లకు పశువులు మృత్యువాతపడ్డాయి. మరోవైపు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.