హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో కుంభవృష్టి కురిసింది. శనివారం రాత్రి 2 గంటల్లోనే వర్షం బీభత్సం సృష్టించింది. అత్యధికంగా మణికొండలో 8.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని మలక్పేట, ఎల్బీనగర్, కింగ్కోఠి, గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్ సహా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసారంబాగ్లోని బ్రిడ్జిపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద డ్రైనేజీ కోసం తీసిన గుంత వర్షపు నీటి కార ణంగా కనిపించక అందులో పడి ఓ వ్యక్తి గల్లంత య్యాడు. మరోవైపు, బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇది మరింత బలపడి తుఫానుగా మారనున్నదని, దీనికి గులాబ్గా పేరు పెట్టినట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో విశాఖపట్నం – గోపాల్పూర్లోని కళింగపట్నం వద్ద ఆదివారం సాయంత్రం తీరం దాటొచ్చని చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీనుంచి అతి వర్షాలు, చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురువొచ్చని చెప్పారు. సోమవారం బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరా బాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తదుపరి 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని పేర్కొన్నారు.