నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోట్టెత్తింది. ఎగువన ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 33 వరద గేట్లను ఎత్తివేసి 4.04 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా ప్రస్తుతం 1089.3 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు. 81.17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టులోకి 44,771 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12,652 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1404.16 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. జలాశయం నీటిసామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.5 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.