ములుగు : తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం.. గడచిన రెండు రోజులుగా రాష్ట్రంతో పాటు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నది.