కామారెడ్డి : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం అంకోల్ తండాకు చెంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తండా సర్పంచ్ భద్యనాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బాబు గుగులోత్, బోడ రాము, ధూప సింగ్ బానోత్, పెర్మల్ బానోత్, పాల్త్య భీమా, చంగ్య, పాల్త్య ధూప సింగ్, కె.మంగత్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన 180 కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
వారికి బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాస్కర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ విఠల్, అంకోల్ తండా ఉప సర్పంచ్ రవీందర్, నసురుల్లాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి,, మైలారం ఫ్యాక్స్ చైర్మన్ పెర్క శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సాయిలు కార్యకర్తలు పాల్గొన్నారు.