మంచిర్యాల : ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 33 గేట్లు ఎత్తి 4,15,338 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.