హైదరాబాద్ : ములుగు(Mulugu) జిల్లాలోని పస్రా,(Pasra) తాడ్వాయి అటవీ ప్రాంతంలో(Forest area) కార్చిచ్చు(Fire accident) రగులుకుంది. ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతున్నది. ప్రాణ భయంతో వన్య ప్రాణులు పరుగులు తీశాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.