హైదరాబాద్ : కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్ పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీఎస్ఎన్ లైఫ్సైన్స్ ఫార్మా కంపెనీలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పక్కనే ఉన్న ఇంటీరియర్ వస్తువుల దుకాణానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.