ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12 : స్నానానికి వెళ్లిన ఓ వృద్ధుడికి గుండెపోటు రావడంతో చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నారె కిష్టయ్య గంగామాత ఆలయం వద్ద ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు.
తూముపై కూర్చోని ఉండ గా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చెరువులో పడి మృతి చెందాడు. ఎస్సై ఉమాసాగర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మెట్పల్లి ప్రభు త్వ దవాఖానకు తరలించారు. కిష్టయ్య భార్య నారె గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా మృతునికి కొడుకు, కూతురు ఉండగా కొడుకు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.