హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయి న్స్ పరీక్ష పేపర్లను తిరిగి మూల్యాంక నం చేయాలని లేనిపక్షంలో తిరిగి పరీక్షలను నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై బుధవారం హైకోర్టు విచారణ చేయనుంది. అవకతవకలు జరిగాయని చెప్పి మొత్తం ఎంపికను రద్దు చేయడం చెల్లదని పరీక్షల్లో అర్హతపొందిన అభ్యర్థులు అప్పీల్ దాఖలు చేశారు. తప్పు చేసిన వా ళ్లపై చర్యలు తీసుకోవాలేగానీ అర్హత పొందిన 563మంది అభ్యర్థులకు శిక్ష విధింపు చెల్లదని పేర్కొన్నా రు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ దాఖలైన అప్పీల్ను చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీ ఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కే లక్ష్మీనరసింహ, సర్వీస్ కమిషన్ న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపించారు. సర్వీస్ కమిషన్ కూడా అప్పీల్ చేయడంతో రెండింటినీ కలిపి విచారిస్తామని ప్రకటించింది.
పేలుళ్ల నిబంధనలు కఠినంగా అమలు చేయాలి ; రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): నగరంలోని కొండలు, గుట్టల బ్లాస్టింగ్కు అనుమతి ఇచ్చే ముందు చట్ట నిబంధనలను కచ్చితంగా కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్లోని న్యాయ విహార్ వద్ద నివాస ప్రాంతంలోని కొండరాళ్ల తొలగింపునకు రేయింబవళ్లు పేలుళ్లు నిర్వహించడంపై పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీనిని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ పూర్తిచేసింది. వాదనల తర్వాత హైకోర్టు, బ్లాస్టింగ్లు పూర్తయినందున పిల్పై విచారణ అవసరం లేదని పేరొంది. ఇకపై ఎలాంటి అనుమతులిచ్చినా నిబంధనలు కఠినంగా పాటించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.