హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో హైదరాబాద్కు పోతే తప్ప కనీస వైద్యం అందని పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సొంతూరులోనే మెరుగైన వైద్యం పొందుతున్నారు. పీహెచ్సీల మొదలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల వరకు అన్నిరకాల వైద్య సదుపాయాలు కల్పించడం, ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు, అత్యంత ఖరీదైన ఆపరేషన్లను సైతం ప్రభుత్వం ఉచితంగా చేస్తుండటం, రాజధాని నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, మరో రెండేండ్లలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కానుండటం, అరచేతిలో ఆరోగ్య వివరాలు పొందుపర్చే హెల్త్ ప్రొఫైల్ వంటి కార్యక్రమాలతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులేస్తున్నది.
ఆరోగ్య లక్ష్మితో ఆహారపుష్ఠి
గర్భిణులు, బాలింతల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరి 1న ఆరోగ్య లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో తల్లీబిడ్డలు, గర్భిణుల కోసం కేంద్రం రూ.6 మాత్రమే ఖర్చు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.22 ఖర్చు చేస్తున్నది.
7 నెలల నుంచి మూడేండ్ల లోపు వయసున్న పిల్లలకు నెలకు 16 కోడి గుడ్లు, గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెతో కూడిన 2.5 కిలోల ప్యాకెట్ ప్రతి నెల 1న అందుతున్నది.
మూడేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలకు నెలకు 30 రోజుల పాటు రోజుకో కోడిగుడ్డు, ప్రతిరోజు అన్నం, పప్పు, కూరగాయలు, స్నాక్స్ అందిస్తున్నది.
1.54 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు. సమస్యలున్న 41 లక్షల మందికి ఫ్రీగా కంటి అద్దాలు, మందుల పంపిణీ
ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు మూడంచెల వ్యవస్థ ఐదంచెలుగా అభివృద్ధి.
గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలలో టిమ్స్ ఏర్పాటుకు నిర్ణయం.
వరంగల్లో రూ.1100 కోట్ల వ్యయంతో 24 అంతస్తుల హాస్పిటల్.
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖకు బడ్జెట్
2014-15లో రూ.780.95 కోట్లు
2021-22లో రూ.1,768.67 కోట్లు
ప్రతి సంవత్సరం 4.21 లక్షల
మంది గర్భిణులు, బాలింతలకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ పౌష్టికాహారం అందిస్తున్నది.
ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని 16.38 లక్షల మంది ఆరేండ్లలోపు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి.
చిన్నారుల రక్షణ కోసం..
రాష్ట్రంలో 35 బాల రక్షక కేంద్రాలు, 14 శిశు గృహాలు, జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక యూనిట్లు, 33 చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు పనిచేస్తున్నాయి.
మహిళా సాధికారత కోసం 181 హెల్ఫ్లైన్ నంబర్, 33 వన్స్టాప్ కేంద్రాలు ఏర్పాటు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళా కేంద్రాలు 19 స్వధార్ కేంద్రాలు, 3 ఉజ్వల కేంద్రాలు
మన ఊరు – మన బడి
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ఈ పథకానికి మూడు దశల్లో మొత్తంగా రూ.7,289. 54 కోట్లు ఖర్చుచేయనున్నారు. తొలి విడుతలో 9123 స్కూళ్ల అభివృద్ధికి రూ.3,497.62 కోట్లు ఖర్చుచేస్తున్నారు.
మహిళా వర్సిటీ ఏర్పాటు
ఉన్నత విద్యలో మహిళల నమోదు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి తెలంగాణ మహిళా వర్సిటీని ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నది. ఇప్పటికే కోఠి మహిళా కాలేజీని వర్సిటీగా అప్గ్రేడ్ చేసింది.
15 వేల బడుల్లో ఆంగ్ల బోధన
1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధనకు అనుమతినిచ్చింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 15 వేల పైచిలుకు బడుల్లో ఆంగ్లమాధ్యమంలో బోధిస్తారు.
మరికొన్ని ముందడుగులు
ఫలక్నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీగా అప్గ్రేడ్ చేసింది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, హాలియా, మహేశ్వరంలో 5 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసింది.
11 పాలిటెక్నిక్ కాలేజీలు ప్రారంభం.
కరోనావేళ ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి రూ.2వేలు, 25 కిలోల బియ్యం మూడు నెలలపాటు అందజేసింది.
గజ్వేల్లో రూ.146 కోట్లతో ప్రపంచస్థాయి ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకు శ్రీకారం. 20 ఎకరాల్లో బాలికలు, 40 ఎకరాల్లో బాలుర కోసం నిర్మిస్తున్నారు.
ఖాళీగా ఉన్న 8792 టీచర్ పోస్టుల భర్తీ.
రాష్ట్ర ప్రభుత్వ కృషితో 9 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు.
కరీంనగర్లో సైనిక స్కూల్ ఏర్పాటు.
అత్యధిక జీతాలు తెలంగాణలోనే..
ఆరోగ్యలక్ష్మి లబ్ధిదారులు గర్భిణులు, బాలింతలు 4,72,942 మంది
3 నుంచి 6 ఏండ్ల పిల్లలు6,90,802 మంది
మొత్తం 11,63,744 మంది
అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు, మినీ అంగన్వాడీ వర్కర్లకు అందిస్తున్న గౌరవ వేతనం, కేంద్ర, రాష్ట్ర వాటా
అంగన్వాడీ వర్కర్
13,650 2,700 10,950
అంగన్వాడీ సహాయకురాలు
7,800 1,350 6,450
మినీ అంగన్వాడీ వర్కర్
7,800 2,100 5,700