Damodara Raja Narsimha : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్(AIOCD) రేపు (మే 20) దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలిచ్చారు. మెడికల్ షాపుల బంద్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
మెడికల్ షాపుల బంద్ ప్రభావం రోగులపై, అత్యవసర మందులు ఉపయోగించే వారిపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన్లు సహా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో బుధవారం 24 గంటల పాటు ఫార్మసీలు తెరిచి ఉంచాలని, ఫార్మసిస్టులను కూడా అందబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులకు మంత్రి సూచించారు.