హైదరాబాద్ : కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాశారు. కరోనా సెకండ్ డోస్, ప్రికాషన్ (బూస్టర్ డోస్) డోసు మధ్య ఉన్న గడువును తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కోరారు. హెల్త్ కేర్ వర్కర్లకు సంబంధించి రెండో, ప్రికాషన్ డోసు మధ్య గడువును మూడు నెలలకు కుదించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కొమొర్బిడిటీస్తో సంబంధం లేకుండా) మూడో డోస్ ఇవ్వాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి సైతం బూస్టర్ డోస్ ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు అమలు చేస్తున్న బూస్టర్ డోస్ టీకా పాలసీ, ఫలితాల ఆధారంగా ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వాటి ఆధారంగా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.