ఈటల నుంచి తప్పించిన కేసీఆర్
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖను తప్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం చేసిన సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. ఈటల నుంచి శాఖ తొలగింపుపై శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.