ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిరలోని భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి మంగళవారం ఖమ్మంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గులాబీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. శీలం వెంకటరెడ్డి గతంలో టీఆర్ఎస్ను వీడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు.
ఇటీవల దానికి రాజీనామా చేశారు. తాజాగా మళ్లీ టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వర్లు, మధిర మున్సిపల్ వైస్చైర్మన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి పాల్గొన్నారు.