ఖమ్మం : కుటుంబ ఆస్తుల వివాదంలో నోటీసు ఇచ్చేందుకు లంచం(Bribe) డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్(Head constable) ఏసీబీ( ACB) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం (Khammam)రెండో పట్టణ పీఎస్లో రైటర్గా పని చేస్తున్న కోటేశ్వరరావు ఓ కుటుంబ ఆస్తుల వివాదంలో నోటీసు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. బాధితులు చేసేదేమి లేక ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.