హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ)/రామగిరి: ఈ నెల 18న టీఎస్ ఎడ్సెట్ నిర్వహించనున్నట్టు ఎడ్సెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ శనివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు ఈ ఏడా ది 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
అధికారులు హాల్టికెట్లను శనివారం విడుదల చేశారు. విద్యార్థులు https://edcet. tsche.ac.in వెబ్సైట్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంతోపాటు ఏపీలోని విజయవాడ, కర్నూలులోని 49 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు 90 నిమిషాల ముందు కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
ఒకేరోజు మూడు సెషన్లు
ఎడ్సెట్ పరీక్షను ఒకేరోజు మూడు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11వరకు, రెండో సెషన్ ఉదయం12:30 నుంచి మధ్యా హ్నం 2:30 వరకు, మూడో సెషన్ సాయంత్రం 4 నుంచి 6 వరకు నిర్వహిస్తా రు. మొదటి సెషన్కు 10,565, రెండో సెషన్లో 10,584, మూడో సెషన్లో 10,576 మంది చొప్పున మొత్తంగా 31,725 మంది పరీక్ష రాయనున్నారు.