శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 29: భారతదేశాన్ని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాదపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్సీయూ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చలనచిత్ర సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకు కౌంటర్గా చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఈ పోస్టులో ‘భారతదేశం స్టుప్పిడ్ కంట్రీ (చెత్త దేశం). ఈ దేశంలో పుట్టడం నా ఖర్మ’ అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని హెచ్సీయూ విద్యార్ధి పేర్కొన్నారు.