హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఏపీలో పలు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ పెట్టాలని చెవిరెడ్డి మోహిత్రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈయన పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టివేసింది.