యాదాద్రి, సెప్టెంబర్ 11: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి భూపాల్రెడ్డి శనివారం యాదాద్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి, ఆలయ ఈవో ఎన్ గీత తదితరులు ఉన్నారు.