హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పంటల సాగు, మెలకువలు, విత్తన నిర్వహణ వంటి అంశాలపై ఐదేండ్లపాటు సమష్టి పరిశోధనలు జరిపేందు కు హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ హర్యానా వ్యవసాయ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది. వ్యవసాయ పరిశోధనలను వేగంగా పూర్తిచేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఇక్రిశాట్ వర్గాలు వెల్లడించాయి.
పర్యావరణంలో మార్పులు, భూసార క్షీణత వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో వ్యవసాయం నానాటికీ భారంగా మారడంతోపాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సాగు విధానాలు, అధిక దిగుబడులనిచ్చే విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంపై ఇక్రిశాట్ దృష్టిసారించింది. అందు లోభాగంగా సంయుక్త పరిశోధనలను, నాలెడ్జి షేరింగ్ను ప్రోత్సహించేందుకు స్థానిక వ్యవసాయ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నది.