హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సులు పెంచడం హర్షణీయమని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్త రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు విశిష్టమైన సేవలు అందించిన వారిని గుర్తించి ప్రశంసించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఇల్లు కట్టుకునే ఉద్యోగులకు 30 లక్షలు అడ్వాన్స్, 30 శాతం ట్రాన్స్పోర్టు అలవెన్స్, 30 శాతం ట్రావెలింగ్ అలవెన్స్, ఉద్యోగి ఇంట్లో పెండ్లి అయితే నాలుగు లక్షల అడ్వాన్స్ ఇవ్వడం తదితర ప్రయోజనాలు కల్పించేందుకు వెంటనే జీవోలు విడుదల చేయడం అభినందనీయమన్నారు.