యాదాద్రి, జూన్ 26 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కొండపై క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు సందడిగా మారాయి. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి భక్తులతో నిండిపోయింది. ప్రధానాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.150 టికెట్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు చెప్పారు. సుమారు 41 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నట్టు ఈవో గీత తెలిపారు. కాగా అన్ని విభాగాలు కలుపుకొని ఖజానాకు రూ.42,68,960 ఆదాయం సమకూరినట్టు ఆమె పేర్కొన్నారు.