ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చిన పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా హెచ్చరించింది. ఆ తీర్పును స్పీకర్ సరిగా పట్టించు కోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అవుతుంది.
– హరీశ్రావు
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ‘రెండేండ్లకాలంలో రాష్ట్ర అసెంబ్లీ హౌస్ కమిటీలను ఏర్పాటు చేయనేలేదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమిటీల పనిమాత్రం ఆగకూడదన్న విషయాన్ని రూల్ 227 స్పష్టంగా చెప్తున్నది. కానీ ఆ కమిటీలే లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ బాధ్యతలు స్వీకరించి రెండేం డ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయనకు రాసి న బహిరంగ లేఖను హరీశ్రావు ఆదివారం విడుదల చేశారు. ఈ రెండేండ్లలో అసెంబ్లీ నిర్వహణలో చోటుచేసుకున్న వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ ప్రతిష్ఠను, రాజ్యాంగస్ఫూర్తిని కాపాడటంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు. శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా, అది జరగడం లేదని పేర్కొన్నారు. అలాగే, సరైన కారణాలు లేకుండా సభను తరచూ హఠాత్తుగా వాయిదా వేయడం, సభా సమయానికి సంబంధించిన రూల్ 13తోపాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్ 16కు విరుద్ధమని పేర్కొన్నారు. ఆయా విషయాలతో శాసనసభ సమావేశాల నిబంధనలకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తిలోదకాలు వదిలారని, అడుగడుగునా అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నరని హరీశ్రావు విమర్శించారు.
సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధానంగా సభ్యులకు ఉన్న క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలో స్పీకర్ ప్రసాద్కుమార్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52 వరకు, అలాగే రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలను పాటించడమే లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానాలు రాకుండా చేస్తున్నారని, తద్వారా రూల్ 38లో కల్పించిన ప్రశ్నల సమయం హకును కాలరాస్తున్నారని తెలిపారు. ఒక ప్రశ్నపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకునేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ ప్రశ్నల అవకాశాన్ని నిరాకరించడం, కుదించడం.. అనేది రూల్ 50 ప్రధాన ఉద్దేశానికి విఘాతం కలిగించడమే అవుతుందని ఆక్షేపించారు. ప్రజా సమస్యలను తక్షణమే ప్రస్తావించే జీరో అవర్ను కూడా ప్రతిసారి కుదించడం సభాహకులను దెబ్బతీయడమేనని తెలిపారు. రూల్ 39 ప్రకారం అన్ స్టార్డ్ ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, రూల్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు ఆ సమాధానాలను అందజేయాలని తెలిపారు. కానీ, ఈ నిబంధనలను పాటించకపోవడం వల్ల సభలో జవాబుదారీతనం లోపించిందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు.
అంచనాల కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని ఆ లేఖలో హరీశ్రావు గుర్తుచేశారు. కమిటీల పని ఎప్పుడూ ఆగకూడదని, సమావేశాలకు సరిపడా సభ్యులు ఉండాలని రూల్స్ 199, 201 చెప్తున్నాయని తెలిపారు. అయినా, వీటిని కూడా పట్టించుకోకపోవడం వల్ల కమిటీల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం మరో ప్రధాన ఉల్లంఘన అవుతుందని తెలిపారు. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించారు. సభలో సభ్యుల హకులను పరిరక్షించే ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్గా వ్యవహరిస్తారని, ఆ పదవి ఖాళీగా ఉండటం వల్ల కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని తెలిపారు. ఫలితంగా, సభ్యుల హకుల ఉల్లంఘనకు సంబంధించిన అనేక ఫిర్యాదులు పరిషారం కాకుండా పెండింగ్లో ఉన్నాయని, ఇది రూల్ 256, 257కు విరుద్ధమని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం అత్యంత ఆందోళనకరమని హరీశ్రావు ఆ లేఖ ద్వారా అసహనం వ్యక్తంచేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు 1986.. ముఖ్యంగా రూల్స్ 3 నుంచి 7 ప్రకారం విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి, త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. ఆ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2)కు పూర్తిగా విరుద్ధమని తేల్చి చెప్పారు. గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేశారు.