హైదరాబాద్: బ్రాహ్మణ సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సంక్షేమ పరిషత్ ద్వారా అమలుచేసే పథకాలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ బ్రాహ్మణసంక్షేమ పరిషత్ అగమ్యగోచరంగా కావడం బాధాకరమని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన పథకాలు ఆగిపోవడం విచారకరమని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా అనే ఆందోళన బ్రాహ్మణ సామాజికవర్గంలో నెలకొన్నదని తెలిపారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం కేసీఆర్ ఏటా రూ.100 కోట్లు కేటాయించారని చెప్పారు. ‘వివేకానంద’ పేరుతో విదేశీ విద్యా పథకం, ‘శ్రీ రామానుజ’ పేరుతో ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం, ‘వేదహిత’ పేరుతో వేద పాఠశాలలకు మరియు వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతి నెల వేద శాస్త్ర పండితులకు గౌరవ వేతనం, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం, బ్రాహ్మణ యువతకు పోటీ పరీక్షల శిక్షణ వంటి పథకాలను అమలు చేసి ఎంతోమంది పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగులు నింపారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం, విదేశీ విద్యా పథకం కింద 780 మంది పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం రూ.20 లక్షల చొప్పున ఖర్చు చేసింది. 436 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకంగా 5,074 మందిని గుర్తించి, రూ.150 కోట్ల ఆర్థిక భరోసా కల్పించింది. ఇవే కాకుండా, బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచేలా దేశంలోనే తొలిసారిగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ.12 కోట్లతో పది ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించి, బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా మీరు స్పందించి, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతున్నాను.
పరిష్కరించాల్సిన సమస్యలు..