ఖైరతాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణానీటిని అందించిన మహోన్నతుడు ప్రభాకర్రావు అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నివాళులర్పించారు. ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్యభవన్లో ఏర్పాటుచేసిన ఐఈఐ మాజీ అధ్యక్షుడు దివంగత ఇంజినీరు జీ ప్రభాకర్రావు విగ్రహాన్ని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్రావుతో కలిసి మంత్రి హరీశ్రావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం స్మారకోపన్యాసం చేస్తూ.. హైదరాబాద్ నగరాన్ని కృష్ణా పరీవాహక ప్రాంతంలో కి చేర్చి శాశ్వతంగా జంట నగరాలకు కృష్ణానీరు అం దించడంలో ప్రభాకర్రావు పాత్ర గొప్పదని పేర్కొన్నా రు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి నీటిని రప్పించడంలో సఫలీకృతులయ్యారని గుర్తుచేశారు. ఐఈఐ అధ్యక్షుడిగా జాతీయస్థాయిలో రాష్ట్ర గౌ రవాన్ని ఇనుమడింపజేసిన గొప్ప ఇంజినీరు ప్రభాకర్రావు అని కొనియాడారు. వీ ప్రకాశ్రావు మాట్లాడు తూ తెలంగాణ ప్రాజెక్టులు, వాటి అవసరాలపై ప్రభాకర్రావుకు లోతైన అవగాహన ఉండేదని అన్నారు. సమావేశంలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండి యా (ఐఈఐ) చైర్మన్ బీ బ్రహ్మారెడ్డి, కార్యదర్శి డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య, సహాయ కార్యదర్శి టీ వెంకటేశం, సభ్యులు బీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.