సంగారెడ్డి : ఆటో డ్రైవర్లు(Auto drivers) అధైర్య పడకండి అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అన్నారు. ఆదివారం పఠాన్ చెరువు(Patancheru)లో ఆటో డ్రైవర్లతో హరీశ్ రావు మాట్లాడారు. ఆటో కార్మికులు ఈఎంఐలు కూడా కట్టలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డుమీద పడ్డామని వాపోయారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అసెంబ్లీలో బీఆర్ఎస్ గళం విప్పుతుందన్నారు. ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచంచిరు. ప్రభుత్వం నెలకు 10 వేలు ఇచ్చేదాక పోరాడుదామని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఆటో కార్మికులు, తదితరులు ఉన్నారు.