సిద్దిపేట : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బంగారు కిరీటం విలువ రూ. ఒక కోటి ఉంటుందని పేర్కొన్నారు.
స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్రావుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పణ. pic.twitter.com/bMNUleAb8e
— Harish Rao Thanneeru (@trsharish) January 2, 2023