మహబూబ్నగర్: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) పరామర్శించారు. వెంకటేశ్వర్ రెడ్డి సోదరడు ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ఆల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లిన హరీశ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరీశ్ రావు వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లిపూరం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.