హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): మానవజాతి మనుగడకు మొకలే ప్రాణాధారమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. సచివాలయంలో మొకను నాటారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. పచ్చని చెట్టు తోడుంటే గృహమే ఆరోగ్యసీమ అని అన్నారు. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని ప్రశంసించారు. కార్యక్రమంలో స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యారోగ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో..
మంత్రి హరీశ్రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ), వైద్యారోగ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కత్తి జనార్దన్, పూర్ణచందర్, నిఖిల్కుమార్, వంశీ, రాజ్కుమార్యాదవ్, శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ఇతర ప్రతినిధులు శనివారం మంత్రి హరీశ్రావును కలిసి రెవెన్యూ ఉద్యోగుల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.