హైదరాబాద్: గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఘనంగా నివాళులర్పించారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడని చెప్పారు. తమ భూముల్లోంచి నిర్ధాక్షిణ్యంగా గెంటేయడంతో కుమ్రం భీం ఆధ్వర్యంలో 1940 ‘జోడేఘాట్(బాబేఝరి) సాయుధ తిరుగుబాటు మొదలైందని, ఆదివాసీల స్వయం పాలన కోసం ఆయన చేసిన జోడేఘాట్ తిరుగుబాటు మహోజ్వల చరిత్రగా నిలిచిందన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శమని, కుమ్రం భీం ఆశయ అడుగు జాడల్లో పయనిద్దామన్నారు. గోండు వీరుడికి జోహార్లు అంటూ ట్వీట్ చేశారు.
జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం కుమరం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
తమ భూముల్లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేయడంతో కొమురం భీం ఆధ్వర్యంలో 1940 ‘జోడేఘాట్(బాబేఝరి) సాయుధ తిరుగుబాటు మొదలైంది.
ఆదివాసీల స్వయం… pic.twitter.com/VA2dVzvw7M
— Harish Rao Thanneeru (@BRSHarish) October 17, 2024