బాయిల కాడ మీటర్లు పెట్టుడు బీజేపీ విధానం
రైతులకు ఉచితంగా నీళ్లే టీఆర్ఎస్కు ప్రధానం
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు గొప్పతనం మీకేం తెలుసు?
అబద్ధాలు మాట్లాడే అమిత్ షాకు అసలు నిజాలేం తెలుసు?
అమిత్షా.. నాతో రా.. …నీళ్లెట్ల పారుతున్నయో చూపిస్తా
అసత్యాలు పలికే ప్రధాని మోదీ.. వాస్తవాలు తెలుసుకో
నిరంతరం అధికార యావ.. సీఎం కేసీఆర్ నామస్మరణ
ఇదే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తీరు: హరీశ్ ఫైర్
కేసీఆర్ ఇంజిన్కు స్పీడెక్కువ
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సంపద పెంచాం గనుకే డబుల్ ఇంజిన్ సరార్ల కన్నా తెలంగాణలో సంక్షేమం ఎకువగా ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణతో పోల్చితే యూపీ తలసరి ఆదాయం 3 రెట్లు తకువని గుర్తుచేశారు. ‘రైతు బంధు తీసుకున్న రైతును అడగండి. కల్యాణలక్ష్మి చెకు తీసుకున్న మహిళను అడగండి తెలుస్తుంది’ అని అమిత్ షాకు సూచించారు.
వీరిని అడుగు.. కేసీఆర్ ఎవరో?
పచ్చని పైర్లుతొడిగిన బీళ్లను అడుగు..
అలుగు దుంకుతున్న చెరువులను అడుగు..
నిండు కుండలైన ప్రాజెక్టులను అడుగు..
రైతుబంధు పొందిన రైతును అడుగు..
సంబురంగా మెట్టింటికి పోతున్న చెల్లిని అడుగు..
కేసీఆర్ కిట్ అందుకున్న ఆడబిడ్డను అడుగు..
ఆసరా పింఛన్ అందుకున్న అవ్వను అడుగు..
ప్రభుత్వ పథకాలు పొందిన బీజేపీ కార్యకర్తను అడుగు..
-అమిత్షాకు హరీశ్రావు సూచన
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. 8ఏండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? కేంద్రం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం 2.5 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే, రేవులు, విమానాశ్రయాలను కేంద్రం అమ్మితే రాష్ట్రంలో పీఎస్యూలను కాపాడుతున్నాం.
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని.. రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్ఎస్ విధానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన కార్యవర్గ సమావేశాల ద్వారా దేశానికి, తెలంగాణకు ఏదో మార్గ నిర్దేశనం చేస్తుందని ప్రజలు అనుకొంటే.. నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. సమావేశాలు అధికార యావతో ఆద్యంతం సీఎం కేసీఆర్ నామస్మరణ తప్ప మరేవీ వినిపించలేదని చెప్పారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రభుత్వ విప్లు రేగా కాంతారావు, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ద్వయంపై నిప్పులు చెరిగారు. సమావేశాలకు 18 రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చారని, వాళ్లు తెలంగాణ కంటే తమ రాష్ర్టాల్లో ఎక్కువ ఏం చేశారో చెప్తారని ఆశించామని.. కానీ వారి దగ్గర చెప్పడానికి ఏమీ లేదన్నారు. తెలంగాణపై విషం చిమ్మడం తప్ప చేసిందేమీ లేదని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. ‘అమిత్షా.. ఏ జిల్లాకైనా పోదాం. నీళ్లు వచ్చాయో లేదో తెలుస్తుంది. నాతో వస్తే నీళ్లు ఎలా వచ్చాయో చూపిస్తా’ అని సవాల్ విసిరారు. ‘కరీంనగర్ జిల్లా ఇప్పుడు రిజర్వాయర్ల ఖిల్లాగా మారింది. పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం పండించింది తెలంగాణే అని నీతి ఆయోగ్ లెకలు చెప్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతటి ధాన్యం ఎందుకు పండలేదో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. నీళ్లు వచ్చాయో లేదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోవాలని సూచించారు. వ్యవసాయంలో తెలంగాణ సగటున 10% వృద్ధిరేటు సాధించిందని, జాతీయ వృద్ధిరేటు 3%కే పరిమితం అయ్యిందన్నారు. నిజాలు చెప్పకుండా అమిత్ షా అభాసుపాలయ్యారని, నీళ్లు, నిధులు, నియామకాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి స్థాయి తగ్గించుకొన్నారని ఎద్దేవాచేశారు. ఎవరో రాసిచ్చిన స్రిప్ట్ చదివి, తెలంగాణ రైతులను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నీళ్లు వచ్చింది నిజం.. నిధులు వచ్చింది నిజం.. నియామకాలు జరిగింది నిజం.. మేము ఏదీ చెప్పినా ఆధారాలు సహా చెప్తాం’ అని మంత్రి హరీశ్ స్పష్టంచేశారు.
అబద్ధాల షా.. నీ నిధులేవి?
నిధుల విషయంలో అమిత్షాకు మాట్లాడే హక్కే లేదని మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు. రాష్ర్టానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకున్నా తెలంగాణ తనకు తానుగా సొంతంగా ఎదుగుతున్నదని ఆయన వివరించారు. దేశ చరిత్రలో ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విధంగా రాష్ర్టాలకు నిధులివ్వని ఏకైక ప్రధాని మోదీ అని ధ్వజమెత్తారు. 8 ఏండ్లుగా అడుగడుగునా తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నా సీఎం కేసీఆర్ దార్శనిక పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా పురోగమిస్తున్నదని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.11 లక్షల కోట్లు అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చుచేశామని వెల్లడించారు. 2014-15లో రాష్ట్ర బడ్జెట్ రూ.62 వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1.85 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. అభివృద్ధికి తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని కేంద్ర సంస్థలు, గణాంకాలు పలు సందర్భాల్లో పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. తలసరి ఆదాయం విషయంలోనూ తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉన్నదని చెప్పారు. డబుల్ ఇంజిన్ ఉన్న రాష్ర్టాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని వివరించారు. దేశ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఒక శాతం వాటా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిపై అమిత్ షాకు మాట్లాడే నైతిక హక్కులేదని తేల్చిచెప్పారు. సంపద పెంచి..ప్రజలకు పంచటం వల్లే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని మంత్రి హరీశ్రావు వివరించారు.
నియామకాలపై నోరెత్తే హక్కు కేంద్రానికి ఉందా?
8 ఏండ్లలో కేంద్రం చేసిన నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 16.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని మోదీ సర్కారే చెప్పిందని, వాటిని ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ.. ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను మొదలుపెట్టిందని వివరించారు. ఇప్పటికే 1.50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. వాటిల్లో 1.35 లక్షల పోస్టులను భర్తీచేశామన్నారు. మరో 91 వేల పోస్టుల భర్తీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపాదిక కొనసాగిస్తున్నామని తెలిపారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే, రేవులను కేంద్రం అమ్ముతుంటే, రాష్ట్రంలో పీఎస్యూలను కాపాడుకొంటున్నామని చెప్పారు.
అసత్యాల మోదీ.. అసలు నిజాలు తెలుసుకో
ప్రధాని స్థాయిలో అసత్యాలు చెప్పటం మోదీకి సరికాదని మంత్రి హరీశ్రావు అన్నారు. మనిషికి 10 కిలోల బియ్యం ఇస్తున్నామని మోదీ చెప్పటం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.4,246 కోట్లు బియ్యం పంపిణీకి ఖర్చు చేస్తున్నదని, ఆ బియ్యం కూడా మీరే ఇస్తున్నారని అసత్య ప్రచారాలు చేసినవాళ్లు.. దమ్ముంటే ఆ నిధులనివ్వాలని డిమాండ్చేశారు. ఆయుష్మాన్ భారత్ విషయంలో మోదీ చెప్పిన మాటకు వాస్తవానికి పొంతనేలేదని మండిపడ్డారు. ఆ పథకం రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకే వర్తిస్తుందని, దానితో ప్రజానీకానికి నష్టం జరుగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ కింద 87.5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్కు రూ.170 కోట్లు ఖర్చైతే ఆరోగ్యశ్రీ కింద రూ.980 కోట్లు ఖర్చు చేశామన్నారు. మోదీ పుణ్యమా అని మహిళలు గ్యాస్ సిలిండర్లను అటకెక్కించే రోజులు దాపురించాయని మండిపడ్డారు. రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1000కి తీసుకెళ్లిన ఘనత మోదీదే అని పేర్కొన్నారు.. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై పల్తెత్తు మాట మాట్లాడలేదన్నారు. సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
కృష్ణానదిలో వాటా తేల్చరేం
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని అనేకసార్లు కోరినా కేంద్రం ఇవ్వలేదని హరీశ్రావు పేర్కొన్నారు. కర్ణాటకలోని అప్పర్భద్ర, మధ్యప్రదేశ్లోని కెన్-బెత్వా, ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రాష్ట్ర ప్రాజెక్టులను తొక్కిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన కేంద్రం.. పార్టీ వేదిక మీద మాత్రం అనినీతి జరిగిందని పేర్కొనటం దుర్మార్గమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎనీ టైమ్ వాటర్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ‘ఎనీ టైం మీటర్ అనే మీకు ఎనీ టైమ్ వాటర్ ఇచ్చే కాళేశ్వరం గొప్పతనం ఏం తెలుసు?’ అని నిప్పులు చెరిగారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడమే బీజేపీ విధానమని మండిపడ్డారు. మీటర్లు పెట్టకపోతే రూ.25 వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు రావని చెప్పినా సరే.. ‘నా కంఠంలో ప్రాణముండగా మీటర్లకు ఒప్పుకోబోం’ అని కేసీఆర్ తెగేసి చెప్పారన్నారు. కృష్ణానది జలాల వాటా తేల్చాలని నలుగురు కేంద్ర జలవనరుల శాఖ మంత్రులను కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనాలంటే కొనకుండా కేంద్రం తొండి చేస్తుందని మండిపడ్డారు. వడ్లు కొనబోమని పీయూష్గోయల్ మొండికేస్తే, వాటిని సీఎం కేసీఆర్ కొన్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ 90 లక్షల టన్నుల బియ్యం మిల్లుల్లో ఉన్నాయని వివరించారు. కొనాల్సిన ఎఫ్సీఐని కొనకుండా అడ్డుపడుతున్నది కేంద్ర సర్కారేనని ఆగ్రహించారు.
ప్రజలే మా హైకమాండ్
తెలంగాణ అభివృద్ధి గురించి బీజేపీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కులేదని మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఒక్క ఓటు రెండు రాష్ర్టాలని కాకినాడలో తీర్మానం చేసి రాష్ట్ర ఏర్పాటు కాకుండా ద్రోహం చేసింది బీజేపీ అని మండిపడ్డారు. 3 రాష్ర్టాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే.. వందల మంది తెలంగాణ కోసం ఆత్మత్యాగాలకు పాల్పడేవారే కాదని పేర్కొన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి అమిత్ షా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలంటే గడ్డిపోచలుగా భావించి ప్రజల పక్షాన తాము నిలిస్తే, కిషన్రెడ్డి రాజీనామా చేశారా? అని నిలదీశారు. తెలంగాణ పోరాటం, త్యాగాలు బీజేపీకేం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ త్యాగాల గురించి, అన్ని విధాలుగా పురోగమిస్తున్న రాష్ట్రం గురించి ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలే తమ దేవుళ్లని.. తమకు హైకమాండ్ అని తేల్చిచెప్పారు.