బీజేపీ గత మ్యానిఫెస్టోలో ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. పదేండ్లలో ఆ హామీ అమలు కాలేదు. ఈసారి అసలు ఉద్యోగాల ముచ్చటే మ్యానిఫెస్టోలో పెట్టలేదు.
-హరీశ్రావు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా బీజేపీ మ్యానిఫెస్టో ఉన్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆర్భాటపు ప్రకటనలు తప్ప బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఏమీ లేదన్నారు. బీజేపీ మాటల్లో వికసిత్ భారత్ – చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి నిరూపించిందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. దేశంలో ఏ వర్గానికి మేలు చేయని మ్యానిఫెస్టోను విడుదల చేసి మరోసారి ప్రజలను మోసం చేయటానికి అందమైన అబద్ధాన్ని వండివార్చిందని ఆయన విమర్శించారు. మహిళలు, యువకులు, పేదలు, రైతులే తమకు ప్రధానమని చెప్పినా ఆ నాలుగు వర్గాలను బీజేపీ విస్మరించిందని పేర్కొన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోపై ఆయన రంగాల వారీగా ఎత్తి చూపిన అంశాలు ఆయన మాటల్లోనే…