హైదరాబాద్: పది మంది పోలీసులను సర్వీస్ నుంచి తొలగించడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అని విమర్శించారు. తాను పోలీసు కుటుంబం నుంచి వచ్చానని, పోలీసుల కష్టాలు తనకు తెలుసని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఊదరగొట్టారని ఫైరయ్యారు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా అని ప్రశ్నించారు. పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని, వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని నిలదీశారు. .
భేషజాలు పక్కన పెట్టి టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలన్నారు. 10 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పారు. సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘‘ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు.. అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి గారు.. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు.?
వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.
ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
“నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు” అంటూ ఎన్నికల… pic.twitter.com/Xa4850MAt4
— Harish Rao Thanneeru (@BRSHarish) October 28, 2024