బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆరోగ్య శ్రీ కింద రూ.5 లక్షల నుండి రూ.15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామని, కానీ మీరు 496 మందికే ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని నోటీసులు ఇచ్చినా బిల్లులు రిలీజ్ కావడం లేదని ఆరోపించారు. చిన్న చిన్న దవాఖానలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో.. ఎప్పటిలోగా చెల్లిస్తారో సదరు శాఖకు సంబంధించిన మంత్రి సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.