ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 13: గోదావరిఖనిలోని సింగరేణి వైద్య విజ్ఞాన సంస్థ హాస్టల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధిం చారు. సోమవారం రాత్రి హాస్టల్లో ఓ వైద్య విద్యార్థి తల వెంట్రుకలను సీనియర్లు కత్తిరించారు. దీంతో ఆ విద్యార్థి మంగళవారం ఇంటికెళ్లి జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలుపడంతో విషయం బయటకు వచ్చింది. జూనియర్ విద్యార్థులందరూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రిన్సిపాల్.. విచారణకు కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపిస్తామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని గోదావరిఖని వన్టౌన్ సీఐ ప్రమోద్రావు తెలిపారు. ఈ క్రమంలోనే మెడికల్ కాలేజీలో వన్టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాగింగ్పై అవగాహన కల్పించినట్టు చెప్పారు.